Thursday, May 2, 2024

రాయితీ చ‌లానాలు- రూ.302కోట్లు వ‌సూల్

ద్విచ‌క్ర‌, ఫోర్ వీల‌ర్ త‌దిత‌ర వాటిపై చ‌లానాల‌కి రాయితీ క‌ల్పించింది తెలంగాణ ప్ర‌భుత్వం. కాగా ఈ గ‌డువు నిన్న‌టితో ముగియ‌గా..నిన్న రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 302 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఐదు కోట్ల పెండింగ్ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చివరి రోజు కూడా చలానాలు భారీగా వసూలయ్యాయి. నిజానికి ఈ గడువు ఇది వరకే ముగియగా, ఈ నెల 15 వరకు దానిని పొడిగించింది. దీంతో గతంలో చెల్లించలేకపోయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement