Saturday, May 4, 2024

BREAKING: రాములోరి కళ్యాణంలో తోపులాట

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని శ్రీ సీతారామేంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన రాములోరి కళ్యాణంలో తోపులాట చోటు చేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణానికి హాజరు కావడంతో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భక్తులు ఎవరికీ వారుగా ఒక్కసారిగా కళ్యాణ మండపం వద్దకు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. భక్తులు ఒక్కరిపై ఒక్కరు పడి తోసుకున్నారు. కళ్యాణ దాతలు మండపం ముందు కూర్చున్నది కూడా చూడకుండా వారిపై నుండి తొక్కుకుంటూ వెళ్లారు. ఇంత జరుగుతున్న కూడా ఆలయ అధికారులు, పోలీసులు ఎమాత్రం పట్టించుకోలేదు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement