Thursday, April 25, 2024

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం – ఆక‌ట్టుకుంటోన్న టైటిల్ పోస్ట‌ర్

హీరో అల్ల‌రి నరేష్ 59వ చిత్రం రాజ్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం అనే టైటిల్ పెట్టారు. కాగా ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేయ‌గా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పీపూల్ ఆర్ ది ఎజెండా అన్న పాయింట్ సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోది. యానిమేటెడ్ కార్టూన్ పోస్టర్ లో గుంపుగా జనం కనిపిస్తున్నారు. తమలోని ఐక్యమత్యాన్ని చాటి చెబుతున్నట్లు కనిపిస్తుంది. పోస్టర్ లో ఒక్కొక్కరు గునపం..పలుగు..పార..కత్తి పట్టుకుని శత్రువులపై ఐక్యమత్యంగా పోరాటానికి దిగినట్లు కనిపిస్తుంది. పోస్టర్ డిజైన్..టైటిల్ ని బట్టి ఇది పూర్తిగా అల్లరి నరేష్ గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రం హిట్ అవుతుంద‌నే ఆశ‌తో ఉంది చిత్ర యూనిట్..చిత్ర టైటిల్ తోనే ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచారు చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement