Friday, May 3, 2024

వైభవంగా సీతారాముల కళ్యాణ క్రతువు

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ రామాలయంలో సీతారాముల కళ్యాణ క్రతువు కన్నుల పండువగ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో పొన్నసేవ చేయగా, మధ్యాహ్నం సీతారాముల కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. శ్రీ రామనవమి పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కల్యాణానికి మాజీ ఎంపీ, రామాలయం ట్రస్ట్ కమిటి శాశ్వత ఛైర్మెన్ రామసహయం సురేందర్ రెడ్డి జయమాల దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందించగా.. టీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, పురుషోత్తమయగూడెం సర్పంచ్ నూకల అభినవ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు కల్యాణ ఘట్టాన్ని వీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement