Friday, May 3, 2024

ఢిల్లీ ధమాకా.. ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం

ఐపీఎల్ 2021 లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అమిత్‌ మిశ్రామాయాజాలం… శిఖర్‌ ధావన్‌ నిలకడ… వెరసి వరుస మ్యాచ్‌ ల విజయాలతో జోరు మీదున్న ముంబైని ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్‌ షాక్‌ ఇచ్చింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీకి ముంబై బౌలర్ షాక్ ఇచ్చారు. చెపాక్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌ లో పంత్‌ సేన 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచి.. ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 44 రన్స్ చేయగా… మిగిలిన వారెవరూ 30 పరుగుల మార్క్‌ ను కూడా చేరుకోలేకపోయారు. అమిత్‌కు 4, అవేశ్‌కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో శిఖర్‌ ధవన్‌ 45, స్టీవ్‌ స్మిత్‌ 33 రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. ముంబై బౌలర్లలో జయంత్‌, బుమ్రా, చాహర్‌, పొలార్డ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మిశ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement