Wednesday, May 1, 2024

ఢిల్లీలో ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి

జైపూర్ నుండి ఢిల్లీ చేరుకున్న ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఈ మేర‌కు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, 2014 తర్వాత ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి పేర్కొన్నారు. రాళ్లు రువ్విన విషయాన్ని ఇంటి పనిమనిషి ద్వారా తెలిసిందన్న ఒవైసీ.. ఈ దాడిలో కిటికీ అద్దాలు బద్దలైనట్టు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే అదనపు డీసీపీ సారథ్యంలోని పోలీసులు ఒవైసీ ఇంటిని సందర్శించారు. ఘటనా స్థలం నుంచి సాక్ష్యాధారాలను సేకరించారు. అత్యంత భద్రత ఉండే జోన్‌లోనే దాడి జరగడం ఆందోళన కలిగిస్తోందన్న ఆయన నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement