Monday, April 29, 2024

ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకుంటే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు

ఆసుపత్రుల్లో రోగుల‌కు ఆక్సిజ‌న్ అంద‌క‌పోతుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మ‌వుతోన్న తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రోగుల‌కు ఆక్సిజ‌న్‌ను అందించ‌క‌పోవ‌డం అనేది నేర‌పూరిత చ‌ర్య అని చెప్పింది. జీవించ‌డం ప్ర‌జ‌ల ప్రాథ‌మిక హ‌క్కు అని గుర్తు చేసింది. అలాగే, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎవ‌రైనా ఆటంకాలు క‌లిగిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పింది. ఆక్సిజన్ కొరత ఉందని ఎవరైనా చికిత్స తీసుకుంటున్న పేషెంట్ కి ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తే వారిని ఉరి తీస్తామని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఇక ల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆక్సిజ‌న్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అలాగే, సొంతంగా ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

ఆక్సిజ‌న్ కొర‌త‌పై  ప‌లు ఆసుప‌త్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌డంతో వాటిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.. ఈ విష‌యంలో కేంద్ర స‌ర్కారు మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement