Friday, March 29, 2024

భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త

హత్య చేసి సవక తోటలో తగలబెట్టిన వైనం
కుటుంబ కలహాల నేపద్యంలోనే భార్య సుభాషిణి ను హత్య చేసిన భర్త శ్రీహరి

గూడూరు రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసి ఆపై సవక తోటలో పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన గూడూరు మండల పరిధిలోని వేముల పాలెం సమీపంలో ఉన్న సవక తోటలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ పుల్లారావు వివరాల మేరకు వేములపాలెం సవక తోటలో కాలిన మృతదేహం ఉన్నట్లు స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు.. కాలిన మృత‌దేమం కైతపల్లి సుభాషినిగా గుర్తించారు. గూడూరు రెండో పట్టణంలోని దిగువీరారెడ్డి పల్లి లో నివాసం ఉంటున్న కైతపల్లి శ్రీహరి సుభాషిణి దంపతులు నిత్యం ఏదో ఒక కారణంతో గొడవలు పడుతూ ఉండేవారు. భర్త శ్రీహరి నిత్యం మ‌ద్యం బానిస గా మారి సుభాషిని కొడుతూ వేధిస్తుంటే ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.. ఈ క్రమంలో ఏమి జరిగి ఉంటుందో తెలియదు కానీ గురువారం రాత్రి భర్త శ్రీహరి మద్యం సేవించి సుభాషిణితో గొడవకు దిగి హతమార్చి సవక తోటలో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు ప్ర‌స్తుతం భ‌ర్త శ్రీహరి పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు … మృతురాలు సుభాషిణికి ఇద్దరు కుమారులు .

Advertisement

తాజా వార్తలు

Advertisement