Monday, April 29, 2024

త‌గ్గుతోన్న క‌రోనా కేసులు – కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డి

థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌గ్గుతోంది..ఇప్పుడిప్పుడే క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. కాగా నిన్న దేశంలో 58,077క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా నిన్న‌ 1,50,407 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,07,177కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,71,79,51,432 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 48,18,867 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement