Sunday, April 28, 2024

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. వెయ్యి దాటిన కేసులు

ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,005 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135, నెల్లూరు జిల్లాలో 84, కర్నూలు జిల్లాలో 42, అనంతపురం జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 35, తూ.గో. జిల్లాలో 25, శ్రీకాకుళం జిల్లాలో 22, కడప జిల్లాలో 21, ప.గో. జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో 13 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 324 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,98,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5,394గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,205గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement