Friday, April 26, 2024

కొత్తగా1,604కరోనా కేసులు

నేడు కొత్తగా 1,604కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసులు 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు. మరో 18,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2160 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.63 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 1,39,111 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement