Thursday, May 16, 2024

Breaking: ఇద్దరు డిప్యూటీ సీఎంలతో సహా.. నలుగురు మంత్రులకు కరోనా..

బుధవారం బిహార్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్‌తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కరోనా పరీక్ష తప్పనిసరి చేయడంతో మంత్రులందరూ పరీక్షలు చేయించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంలు, మరో నలుగురు మత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకిన వారిలో ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఈయన మంగళవారం ఔరంగాబాద్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి సంఘ సంస్కరణ ప్రచార యాత్రలో పాల్గొన్నారు. అయితే, సునీల్ కుమార్‌తో భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరికి పాజిటివ్ అని తేలింది. సునీల్ కుమార్‌ తోపాటు ఔరంగాబాద్‌లో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి షానవాజ్ హుస్సేన్ కు నెగెటివ్ అని తేలడంతో ఆయన కేబినెట్ భేటీకి హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement