Sunday, May 19, 2024

హెల్ప్ కోరిన అమ్మాయి.. కాపాడిన‌ట్టే న‌టించి కాటేశాడు.. వ్య‌భిచారం చేయించేందుకు ట్రై చేస్తుంటే..

ఆపదలో ఉన్న అమ్మాయి రక్షించమని వేడుకుంటే కాపాడినట్టే నమ్మించాడు. ఇంట్లో గొడవపడి వచ్చేసిందని తెలిసి తనతో తీసుకెళ్లాడు. నమ్మివచ్చిన బాలికకు మత్తుమందిచ్చి మృగంలా కామవాంఛ తీర్చుకున్నాడు. తన స్నేహితుడితో కలసి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు మరో ఇద్దరు మహిళలకు అప్పగించి వ్యభిచారం రొంపిలోకి దించాడు. రోజూ విటులను పిలిపించి శరీరాన్ని ఛిద్రం చేశారు. అయితే ఆ టీనేజ్ బాలికకు ఎంతోకొంత టెక్నాలజీ తెలిసి ఉండడమే ఆమెను ఆ రొంపిలో నుంచి బయటపడేసింది. చేతికి సెల్‌ఫోన్ దొరకగానే తన లొకేషన్ షేర్ చేయడంతో బంధువులు, పోలీసుల సాయంతో ఆమెను కనిపెట్టి నరకం నుంచి విముక్తి కల్పించారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగర నడిబొడ్డున పాతబస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కిషన్‌బాగ్‌లో నివాసముంటోంది. గతేడాది నవంబర్ 20న తన అక్కతో గొడవపడిన టీనేజ్ బాలిక అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికొచ్చేసేంది. రాజేంద్రనగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఫిష్ బిల్డింగ్ ప్రాంతం వైపు నడుచుకుంటూ వస్తుండగా పోకిరీలు ఆమె వెంటపడ్డారు. అంత రాత్రి వేళ దిక్కుతోచని బాలిక రక్షించమంటూ ఓ ఆటోడ్రైవర్‌ను శరణు కోరింది. పోకిరీలను తిట్టి అక్కడి నుంచి పంపించేసిన ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్ ఆమెపై కన్నేశారు. సాయం చేశారని నమ్మేసిన బాలిక వారి వెంట ఉప్పర్‌పల్లిలోని ఇంటికెళ్లారు. అక్కడ బుస్రా సుల్తానా,, ఆయేషా బేగంలకు బాలికను అప్పగించారు.

అప్పటి నుంచి అక్కడే ఉంటున్న బాలికను గత నెల 26న మైలార్‌దేవ్‌పల్లికి మార్చారు. అక్కడ ఆమెకు మత్తుమందిచ్చి నీచానికి పాల్పడ్డారు. సుల్తానా, ఆయేషా సహకారంతో ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగని కీచకులు ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. విటులను పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయించారు. ఎలాగైనా వారి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక ఆయేషా ఫోన్‌తో తన లొకేషన్‌ను బంధువుకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటికే బాలిక కనిపించడం లేదని కేసు పెట్టిన బంధువులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 31న లొకేషన్ పెట్టిందని బహదూర్‌పురా పోలీసులకు తెలియజేయడంతో వెంటనే రంగంలోకి దిగారు.

బాలిక లొకేషన్‌‌‌ను ట్రేస్ చేసిన పోలీసులు నరకం నుంచి ఆమెను కాపాడారు. వ్యభిచార రొంపిలోకి దించేందుకు సహకరించిన సుల్తానా, ఆయేషాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు సమీర్, హఫీజ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి వెతుకుతున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement