Friday, May 10, 2024

సంగమేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి ‘మేకపాటి’

సంగం (ప్రభ న్యూస్) : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలంలో కొలువై ఉన్న కామాక్షిదేవి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పెన్నానది, బొగ్గేరు వాగులు కలిసే సంగమంలో వెలిసిన పురాతన ఆలయంలో మంత్రి గౌతమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని ప్రార్థించారు. అంతకుముందు స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి మేకపాటికి ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో మంత్రి మేకపాటిని ఆశీర్వదించారు. మంత్రి మేకపాటితో పాటు సంగం మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి , వైసీపీ నాయకులు కంఠాబత్తిన రఘునాథరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement