Friday, April 26, 2024

India corona: మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య ఇవాళ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 13,091 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 340 మంది కరోనా తో మరణించారు. అదే సమయంలో మొత్తం 13, 091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,38,556 కు చేరింది. ఇంత తక్కువగా యాక్టివ్‌ కేసులు నమోదవడం 266 రోజుల తర్వాత ఇదే మొదటి సారి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.25 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 110.23 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement