Friday, May 3, 2024

రైట్…రైట్…తెలంగాణ లో పరిగెడుతున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజుకు రోజుకు పుంజుకుంటుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు మహమ్మారి కారణంగా ఇద్దరు మరణించారు. అలాగే 168 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

అయితే కొత్తగా నమోదు అయిన కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన కేసుల సంఖ్య 3,00,933 కు చేరుకుంది. అలాగే 2,97,363 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు 1652 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 1,918 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 749మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 34,482 మందికి పరీక్షలు జరపగా 216 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 91,49,467 మందికి టెస్ట్ కు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement