Thursday, May 2, 2024

పెరుగుతోన్న క‌రోనా కేసులు-కొత్త‌గా 13,313

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాగా కొత్త‌గా 13,313 మంది క‌రోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది మరణించగా, 10,972 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మొత్తం కేసుల్లో 0.19 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.60, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. రోజువారీ రికవరీ రేటు 2.03 శాతానికి పెరిగిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 196.62 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement