Monday, May 6, 2024

Hyd: కలుషిత నీరు : వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన 45మంది

హైదరాబాద్ లోని కొండాపూర్ లో కలుషిత నీటితో 45మంది ప్రజలు ఆస్పత్రి పాలైన ఘటన చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగడంతో తీవ్ర వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో కొండాపూర్ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement