Monday, May 6, 2024

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: కాంగ్రెస్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్య

తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల ప్రకటన చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నిరుద్యోగులను వ్యతిరేకత ఎదురైయ్యే అవకాశం ఉందనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఉద్యోగ ప్రకటనను స్వాగతిస్తున్నాము కానీ ఉద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగల కోసం చనిపోయిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని.. నిరుద్యోగ భృతి క్రింద రూ.3 వేలు ఇవ్వాలని కోరారు. శాఖలు కుదించి ఉద్యోగ నియామకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న ఖాళీలు, ఉద్యోగ విరమణ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement