Friday, April 26, 2024

మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్ కి థ్యాంక్స్ చెప్పిన – స్టార్ హీరో ప్ర‌భాస్

మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి థ్యాంక్స్ చెప్పాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. రాధేశ్యామ్ చిత్రం మ‌ల‌యాళ వెర్ష‌న్ లో త‌న పాత్ర‌కి పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుతంగా డ‌బ్బింగ్ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పాడు. పృథ్వీరాజ్ గొప్ప నటుడు అని తాను చెప్పవలసిన పనిలేదనీ, ‘సలార్’ సినిమాలో ఆయన కీ రోల్ పోషించాడనీ, ఆయన నటనను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించిందని చెప్పాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. హీరోగా ఆయన ఎంత సక్సెస్ అయ్యాడో, దర్శకుడిగా కూడా అంతే సక్సెస్ కావడం విశేషం. ఇక నిర్మాతగాను ఆయన ఖాతాలో సక్సెస్ లు కనిపిస్తాయి. మరో విశేషమేమిటంటే ఆయన మంచి సింగర్ కూడా. ఫాహద్ ఫాజిల్ తరువాత తెలుగు తెరకి పరిచయమవుతున్న మరో మలయాళ స్టార్ గా ఆయనను చెప్పుకోవచ్చు. ప్రభాస్ తాజా చిత్రంగా రూపొందిన ‘రాధే శ్యామ్’ ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement