Saturday, May 4, 2024

తారక రత్న మృతికి ప్రముఖుల నివాళులు

సినీ నటుడు నందమూరి తారక రత్న మృతికి పలు వురు ప్రముఖుల నివాళుల అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఎపి ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం ప్రకటించారు.

సినీనటుడు, టీడీపీ యువకెరటం నందమూరి తారకరత్న ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండే తారకరత్న మృతి చెందారన్న మాట కోట్లమంది అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి తీరని లోటు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యువుతో పోరాడి స్వర్గస్తులయ్యారుతిరిగి వస్తారనుకున్న తారకరత్న.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడన్నది నమ్మలేక పోతున్నాం. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా .. టీడీపీ ఎపి అధ్యక్షుడు ఆచ్చే నాయుడు https://twitter.com/AndhraPrabhaApp/status/1627002071290613761?t=6z9R9vNEkAL0pKxcIuNoVw&s=19

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement