Thursday, April 25, 2024

ట్రాక్‌ మరమ్మత్తు పనులు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు

హదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం 34 రైళ్లను రద్దు చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. ఇందులో 18 రెగ్యులర్‌ రైళ్లు ఉండగా, మరో 16 రైళ్లు ఎంఎంటిఎస్‌కు ఎంఎంటిఎస్‌కు సంబంధించినవిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18న ఎంఎంటిఎస్‌ లోకల్‌ రైళ్లను, రద్దు చేయగా మిగతా వాటిని ఈనెల 19న ఈ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆయా మార్గాలలో ట్రాక్‌ తదితర మరమ్మత్తు పనులు సాగుతున్న కారణంగా సంబంధిత రైళ్లను రద్దు చేసినట్లు ద.మ.రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement