Tuesday, May 7, 2024

టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఏడాది-ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

టిపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ప‌ద‌విని చేప‌ట్టి నేటితో ఏడాది అయింది. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల‌తో క‌లిసి ఉన్న ఫొటోల‌తో పాటు టీపీసీసీ అధ్య‌క్షుడిగా తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటున్న ఫొటోను స‌ద‌రు ట్వీట్‌కు జ‌త చేశారు. త‌న‌పై న‌మ్మకం ఉంచి పార్టీ అధి నాయ‌క‌త్వం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ అన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గీతారెడ్డి ఆయ‌న‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల నుంచి కూడా రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement