Saturday, May 4, 2024

నాలుగు రాష్ట్రాల్లో పోటాపోటీగా రాజ్యసభ ఎన్నికలు..

నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు పోటాపోటీగా జరుగనున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, హర్యానాలో 16 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజ్యసభకు 41మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 57స్థానాల్లో బీజేపీ 23, కాంగ్రెస్ పార్టీ 8 గెలుపొందారు. ప్రలోభాల ఆరోపణలతో హోటళ్లు, రిసార్టుల్లో పార్టీల క్యాంపులు నిర్వహించారు. ప్రత్యేక పరిశీలకులతో పోలింగ్ వీడియో రికార్డు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రాజ్యసభ ఎన్నికలకు ప్రాధాన్యం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement