Tuesday, May 14, 2024

ట్వ‌ల్త్ మేన్ గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న – మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ట్వ‌ల్త్ మేన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి సొంతదైన జీవితం, వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం అనే మూడు విభిన్న జీవితాలు ఉంటాయని ఈ టీజర్ చెబుతోంది. టీజర్ చివర్లో ఫైనల్ విజిల్ వేసే సమయం వచ్చింది అనే మోహన్‌లాల్ డైలాగ్‌ టీజర్ పై ఆసక్తిని పెంచుతుంది. జీతూ, మోహన్‌లాల్‌ మరో థ్రిల్లర్ తో మన ముదుకు వస్తున్నట్లు అర్థం అవుతోంది.ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, సైజు కురుప్, శివద, అను సితార, అనుశ్రీ, ప్రియాంక నాయర్, అను మోహన్ ఇతర కీలక పాత్రథారులు. దీని రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. ఇక మోహన్ లాల్ ‘దృశ్యం 2క, బ్రో డాడీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత డైరెక్ట్ గా మరోసారి ఓటీటీలో రాబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement