Tuesday, May 7, 2024

Breaking: సీఎం కేసీఆర్‌ కు స్వల్ప అస్వస్థత.. యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీస్కాన్, యాంజియో గ్రామ్ పరీక్షలు చేయించుకోనున్నారు. కాగా.. ఇవాళ యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటించాల్సి ఉంది. అయితే, అస్వస్థత కారణంగానే యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. యాదాద్రిలో జరగాల్సిన పనుల పురోగతిపై ఆయన సమీక్షించాల్సి ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకున్నారు. యశోద ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement