Monday, April 29, 2024

TS: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల‌కు వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు

తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వ‌ శ‌నివారం మ‌రో శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) శ‌నివారం మ‌రో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు టీఎస్పీఎస్సీ ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ఈ నెల 22 నుంచి అక్టోబ‌ర్ 14 వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement