Sunday, April 28, 2024

కొవిడ్ రోగులు ఎక్కువైనా చేర్చుకోవాల్సిందే!

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం..ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలన్నారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లుఇవ్వాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వైద్యులు, మంచి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నామని, కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచాలని సూచించారు. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలని, అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించాలని తెలిపారు. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలని, ఇందులో ఎక్కడా తేడా రాకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలన్నారు.

ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలని సీఎం ఆదేశించారు. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది స్పష్టత వస్తుందన్నారు. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుందన్నారు.

104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుందని, వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలని సీఎం ఆదేశించారు. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలని, కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అలాగే అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారని, అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు సీఎం ఆదేశించారు. ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయలని, కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 47  కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు.  ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement