Friday, May 10, 2024

కరోనా బాధితులకు ఇంటికే ఉచిత భోజనం

హైదరాబాద్ నగరంలో కరోనా బాధితులకు పలు సంస్థల సహకారంతో పోలీసుశాఖ ఉచితంగా ఇంటికే భోజనం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారికి భోజనం అందించే సేవలను గురువారం నుంచి ప్రారంభించింది. భోజనం కావాల్సిన వారు తమ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి సెల్‌ నెంబర్‌ (7799616163)కు వాట్సాప్‌లో సందేశం పంపాలి. బాధితుల పేర్లు, సెల్‌ నెంబర్‌, నివాసిత ప్రాంతం, ఇంట్లో రోగుల సంఖ్య తదితర వివరాలను పేర్కొన్నాలి. ఉదయం 6 గంటలకు ముందే వాట్సాప్‌ నెంబర్‌కు సందేశం పంపాలి.

ఆ తరువాత పంపిన వారివి మరుసటి రోజు ఆర్డర్‌గా పరిగణిస్తారు. ఒకరు గరిష్ఠంగా ఐదుగురికి భోజనం ఆర్డర్‌ చేయొచ్చు. గరిష్ఠంగా ఐదుసార్లు ఆర్డర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేవలను మరింత సజావుగా నిర్వహించేందుకు ‘సేవా ఆహార్’ పేరుతో మరోవారం రోజుల్లో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

ఈ స్టోరీ కూడా చదవండి: కరోనా బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement