Thursday, May 9, 2024

చండూరు మండ‌లంలో ‘ష‌ర్మిల’ ప‌ర్య‌ట‌న‌..అధికార‌లోకి వ‌స్తే ఇండ్లు క‌ట్టిస్తా..

ప్ర‌జా ప్ర‌స్థానంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం చండూరు మండ‌లంలో ప‌ర్య‌టించారు ష‌ర్మిల‌. పేదోళ్ల గుడిసెలు చూసి చ‌లించిపోయారామె. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.. వైఎస్సార్‌ టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో నిర్వహించే నిరుద్యోగ దీక్షలో పాల్గొననున్నారు. ఇటీవల ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. ఆ తర్వాత పాదయాత్రగా దీక్షా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ దీక్షకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కార్యకర్తలు తరలిరానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement