Monday, May 13, 2024

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్

టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ కరోనా బారినపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు లోకేష్ తెలిపారు. తారక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు ఎన్టీఆర్ మేనత్త, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ట్వీట్ చేశారు. ‘తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని స్పందించారు.

అటు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement