Monday, May 6, 2024

అన్నామ‌లైకి బెదిరింపులు.. భారీ భ‌ద్ర‌త

ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ త‌మిళ‌నాడు బిజెపి చీఫ్ అన్నామ‌లైకి భ‌ద్ర‌త‌ని భారీగా పెంచింది.ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. ఆయన రక్షణ కోసం 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించనున్నారు. మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకు బెదిరింపులు వస్తున్నాయి. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఇస్లామిక్ టెర్రరిజం స్లీపర్ సెల్స్ పెరుగుతున్నారు. నిషేధిక పీఎఫ్ఐ కార్యకలాపాలు సైతం పెరుగుతున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ డీఎంకే తప్పిదాలను ప్రజల్లోకి ఆయన తీసుకెళ్తున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఆయన ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు ఉగ్రవాద ఘటనలపై డీఎంకే ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అన్నామలైకు కేంద్రం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement