Friday, May 3, 2024

కేంద్రంపై ఎంపీ ‘జయా బచ్చన్‌’ ఫైర్‌

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుతంపై మరోసారి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ నిప్పులు చెరిగారు. బీజేపీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయని, ఓటమి భయం తట్టుకోలేకే కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎర్ర టోపీ దూసుకొస్తోందని, వారే బీజేపీకి సరైన సమాధానం ఇస్తారని చెప్పుకొచ్చారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలే దీనికి వేదిక అవుతుందని అన్నారు. తమ పార్టీ ఓడిపోతుందని తెలిసే.. ఇలా కక్షపూరితంగా బీజేపీ వ్యవహరిస్తోందని వివరించారు. ప్రతిపక్షాల‌ దాడి చేసే రీతిలో వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి దాడులతో.. ప్రతిపక్షాల గొంతు నులిమేసే ప్రయత్నాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సతంత్రంగా పని చేస్తున్నాయని కేంద్రం అంటోందని, అదంతా అబద్ధమని పేర్కొన్నారు. ఇలా నమ్మడానికి తాము నిరక్షరాస్యులమా..? చదువుకోని వాళ్లమా..? అని ప్రశ్నించారు. తన కుటుంబంతో తన గురించి ఎలాంటి విషయం మాట్లాడదల్చుకోలేదని స్పష్టం చేశారు. బీజేపీకి న్యాయం, న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనడానికి మంచి ఉదాహరణ.. లఖింపూర్‌ ఖేరీ కేసు అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌నుఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement