Thursday, April 18, 2024

రోడ్డు ప్రమాదంలో మోతె మండ‌ల కాంగ్రెస్ లీడ‌ర్ మృతి..

మోతె, (ప్రభన్యూస్): సూర్యాపేట జిల్లాలో ఈరోజు జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మృతి చేందారు. ఈ ఘటన మోతె మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల సిరికొండ గ్రామానికి చెందిన గునగంటి వీరభద్రం గౌడ్ (30) ఉర్లుగొండ గ్రామంలోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోఇంచుకొని స్వగ్రామ మైన సిరికొండకు బయలుదేరుతుండగా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న తాటి చెట్టు కు డీ కొనడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరభద్రం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement