Friday, May 3, 2024

Breaking: డిప్యూటీ సీఎం కుమారుడి కారు యాక్సిడెంట్​..

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా అలంపూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. జలౌన్ జిల్లాలో యోగేష్ మౌర్య ఫార్చూనర్ కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నిన్ననే ఉత్తర ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​తో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అందరూ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఇవ్వాల ఇట్లాంటి ఘటన జరగడం దురదృష్టకరమంటున్నారు పరిశీలకులు. అయితే కారులో ఎంత మంది ఉన్నారు. ఎలా ప్రమాదం జరిగిందనే విషయాలను మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement