Sunday, May 12, 2024

Breaking: చెన్నూరు ఎత్తిపోతలకు ఆమోదం.. 1,658 కోట్లతో ప‌నుల‌కు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి 1,658 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. దీంతో చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని 103 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతుందని వెల్లడించారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యులు బాల్కసుమన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement