Friday, May 3, 2024

చిన్నారిపై అత్యాచారానికి పాల్ప‌డిన – బ‌స్సు డ్రైవ‌ర్ ఇంటిని కూల్చివేసిన అధికారులు

న‌ర్స‌రీ చ‌దువుతున్న మూడున్న‌రేళ్ల బాలిక‌పై బ‌స్సులోనే అత్యాచారానికి పాల్ప‌డ్డాడు డ్రైవ‌ర్. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.కాగా డ్రైవ‌ర్ కి బస్సులో ఉన్న మహిళా హెల్పర్ సహకరించడం గమనార్హం.ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుడు షాపూరా ప్రాంతం వసంత్ కుంజ్ సమీపంలోని గార్డెన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని అక్రమంగా ఇంటిని నిర్మించుకున్నట్టు అధికారులు గుర్తించారు. తాజాగా ఆ ఇంటిని ఖాళీ చేయించి కూల్చివేశారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల సమక్షంలో ఇంటిని నేలమట్టం చేశారు. బాలికపై అత్యాచారం ఘటన నేపథ్యంలో అమ్మాయిల స్కూలు బస్సులో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ అవినాష్ లావానియా ఆదేశించారు. బస్సులో సీసీటీవీ కెమెరాను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో స్కూలు యాజమాన్యానిదే బాధ్యత అని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement