Tuesday, April 16, 2024

జైలు పాలైన భ‌ర్త‌.. భార్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

భర్త నేరస్థుడు కావడంతో మనస్తాపంతో భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘ‌ట‌న జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది. ఓ మహిళ… త‌న కుమారుడికి విషమిచ్చి తానూ కూడా పురుగులమందు తాగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా… మ‌హిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. భర్త మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడి జైలు పాలవడంతో మనస్తాపం చెందిన భార్య‌ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement