Friday, April 26, 2024

Breaking: యాదగిరి గుట్టలో కుప్పకూలిన బిల్డిండ్​.. నలుగురు కూలీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఇవ్వాల (శుక్రవారం) ఓ బిల్డింగ్​ ఉన్నట్టుండి కుప్పకూలింది. పురాతన రెండస్తుల బిల్డింగ్​ కుప్పకూలడంతో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు చనిపోయారు. హుటాహుటిన అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

కాగా, యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలడంపై గవర్నర్ డాక్టర్​ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ అధికారులకు గవర్నర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement