Saturday, May 4, 2024

Breaking: కర్ణాటక మాజీ సీఎం మనుమరాలు ఆత్మహత్య!

కర్ణాటక మాజీ సీఎం బీఎస్​ యడియూరప్ప మనుమరాలు అనుమానాస్పద రీతిలో మరణించింది. వసంత నగరలోని తన ఇంట్లో సౌందర్య(30) అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మాజీ సీఎం యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురైన సౌందర్య… 2018లో డా. నీరజ్​ను వివాహం చేసుకుంది. గత కొద్దిరోజులుగా డిప్రెషన్​లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సౌందర్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందిననట్లు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement