Saturday, May 18, 2024

Breaking : రెండు బస్సులు ఢీ – డ్రైవ‌ర్ మృతి – 22మందికి గాయాలు

ఉజ్జ‌యిని – న‌గ‌రంలో రెండు బ‌స్సులు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సుడ్రైవ‌ర్ మృతి చెందాడు..22మంది ప్ర‌యాణికుల‌కు గాయాలు అయ్యాయి. ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు బస్సులు నీముచ్ నుండి ఇండోర్ , ఉజ్జయిని బద్‌నగర్‌కు వెళుతుండగా భేరుఖేరా వద్ద ప్రమాదం జరిగిందని ఉజ్జయిని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దివ్య శుక్లా తెలిపారు. అదే సమయంలో ఒక్కసారిగా బస్సులు అదుపుతప్పి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బద్‌నగర్ వెళ్తున్న బస్సు డ్రైవర్ 45 ఏళ్ల సుభాష్ ప్రాణాలు కోల్పోయాడని దివ్య శుక్లా తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దివ్య శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. రెండు బస్సుల్లో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికుల్లో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement