Thursday, May 16, 2024

Breaking : కాలువ‌లోకి దూసుకెళ్లిన ట్ర‌క్కు – ఏడుగురు కూలీలు దుర్మ‌ర‌ణం-ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ప్ర‌మాద‌వ‌శాత్తు కూలీల‌తో వెళ్తోన్న ట్ర‌క్కు కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు మ‌ర‌ణించారు.మ‌రో 11మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదం క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. గోకాక్‌ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బళ్లారి నాలాలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను వెలికి తీశారు. బెలగావి పోలీస్‌ కమిషనర్‌ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement