Saturday, May 4, 2024

Breaking : హెలికాఫ్ట‌ర్ లో సాంకేతిక లోపం-పొలాల్లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

రాజ‌స్థాన్ లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ అయింది భార‌త వైమానిక ద‌ళానికి చెందిన ఓ హెలికాఫ్ట‌ర్. హ‌నుమాన్‌ఘ‌ర్ జిల్లాలో ఉన్న పొలాల్లో ఈ హెలికాప్ట‌ర్‌ను దించారు. హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ హెలికాప్ట‌ర్‌లో ఉన్న సిబ్బంది సుర‌క్షితంగా ఉన్నారు. సంగ‌రాయి పోలీస్ స్టేష‌న్‌కు చెందిన ఆఫీస‌ర్ ఈ ఘ‌ట‌న గురించి ప్ర‌క‌ట‌న చేశారు. సాంకేతిక లోపం వ‌ల్లే హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement