Wednesday, May 15, 2024

Breaking : తెలంగాణ రాష్ట్రం కూడా నవజాత శిశువే – గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్ గా త‌న‌ను నియ‌మించిన‌ప్పుడు చాలా మంది అనుమాన‌ప‌డ్డార‌ని త‌న‌కు ఎటువంటి అనుభ‌వం లేద‌న్నార‌ని తెలిపారు త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్. హైద‌రాబాద్‌లోని కేర్ ఆసుప‌త్రి ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ మాతృదినోత్సవ వేడుకల్లో తెలంగాణ‌ గవర్నర్ పాల్గొని మాట్లాడారు. త‌న‌కు గైనకాలజిస్టుగా శిశువులకు చికిత్స అందించడంలో అనుభవం ఉందన్నారు. ఆ వృత్తి ఇచ్చిన ధైర్యంతోనే గవర్నర్ గా ముందుకెళ్తున్నట్లు ఆమె చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ గవర్నర్‌ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కూడా నవజాత శిశువు అని వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్‌లో ఈ రోజు రెడ్‌క్రాస్ డే వేడుక‌లు జ‌రిగాయి. ఆ కార్య‌క్ర‌మంలోనూ త‌మిళిసై మాట్లాడారు. కొవిడ్ సమయంలో పోలీసులు, సైనికులు చాలా సహకరించారని ఆమె తెలిపారు. వారు రక్తాన్ని అవసరమైన వారికి సాయం చేయడంలో కృషి చేశారని వివ‌రించారు. రెడ్‌క్రాస్‌ సంస్థ త‌మ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేసి, అన్ని జిల్లాల్లో తమ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement