Sunday, May 5, 2024

Breaking : ఒమిక్రాన్ దృష్ట్యా క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌న్న ‘హైకోర్టు’

కోవిడ్ పై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఒమిక్రాన్ దృష్ట్యా క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారికి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సూచ‌న‌లు చేసింది. అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని తెలిపింది. త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ లు ధ‌రించాల‌ని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాల మాదిరిగానే ఆంక్షలు విధించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు మూడురోజుల్లోనే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది..ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించడానికి వీలు లేదని హైకోర్టు అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement