Friday, April 26, 2024

Breaking : ఏపీ క‌మిటీతో భేటీ ప‌ట్ల సంతృప్తిని వ్య‌క్తం చేసిన స‌భ్యులు

టికెట్ రేట్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం వేసిన క‌మిటీతో నిర్మాత‌ల మండ‌లి, ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు భేటీ అయ్యారు. ఈ భేటీ విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ భేటీపై నిర్మాత‌ల మండ‌లి, ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. క‌మిటీ ఓపెన్ మైండ్ తో ఉందని.. స‌మ‌స్య‌లు, ఇబ్బందుల్ని క‌మిటీ దృష్టికి తీసుకెళ్ళామ‌ని వారు తెలిపారు. స‌ర్కార్ కి రిపోర్ట్ త్వ‌ర‌గా ఇవ్వాల‌ని కోరామ‌ని నిర్మాత బాల‌ర‌త్నం చెప్పారు. కాగా రిలీజ్ కి సిద్ధ‌మ‌య్యాయి పెద్ద చిత్రాలు, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య ఇలా ప‌లు చిత్రాలు విడుద‌ల‌కానున్నాయి. ఈ నేప‌థ్యంలో టికెట్ రేట్ల‌పై ఏ విష‌యం తేల్చాల‌ని వారు కోరిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement