Thursday, May 9, 2024

Breaking : తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌ర్యాట‌కుల సంద‌డి – అమిత్ షా వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌ర్యాట‌కుల సంద‌డి మొద‌లైంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. టూరిస్టుల్లా దిగి..స్ర్కిప్ట్ లు చ‌దువుతున్నార‌న్నారు.కాగా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌కు కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. హైద‌రాబాద్ కి ప్ర‌తి ఒక్క‌రూ రావ‌డం ..నోటికివ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం అనేది ఆన‌వాయితీగా న‌డుస్తోంద‌న్నారు. అమిత్ షా కాదు..అబ‌ద్దాల బాద్ షా అని చెప్పారు. అమిత్ షా ప్ర‌సంగంలో అన్నీ అబ‌ద్దాలే అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ‌కు ప‌నికి వ‌చ్చే ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. తుక్కుగూడ‌లో తుక్కు డిక్ల‌రేష‌న్ ని న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేర‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement