Sunday, April 28, 2024

పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు.. విద్యుత్​ షాక్​తో మృతి

భూపాలపల్లి, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం ప్రమదం జరిగింది. గణపురం మండలం బస్వరాజు పల్లిలో పొలంలో 230 కె/వి విద్యుత్తు లైను తెగిపడింది. అది గమనించక ఓ రైతు ఇవ్వాల (ఆదివారం) అటుగా వెళ్లడంతో విద్యుత్​ షాక్​కొట్టింది. దీంతో ఆ రైతు అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకరాలు పొలం వేయగా వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు ఉదయం పొలానికి వెళ్లాడు. అయితే పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్​ తీగను గమనించక పోవడంతో షాక్​ కొట్టి చనిపోయాడు.

మృతుడికి భార్య సాంబ లక్ష్మి, ముగ్గురు కుమారులున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైంది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement