Thursday, May 2, 2024

Breaking : భారీ అగ్నిప్ర‌మాదం – ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు స‌జీవ‌ద‌హ‌నం

గుడిసెలో చెల‌రేగిన మంట‌లు..దాంతో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది..ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ప్ర‌మాదం పంజాబ్ లోని లూధియానాలో జరిగింది. లూథియానా లోని టిబ్బా రోడ్డు లోని మున్సిపల్ చెత్త డంపు యార్డ్ సమీపంలో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.తల్లిదండ్రులు సహా ఐదుగురు చిన్నారులు తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని లుధియానా అసిస్టెంట్ కమిషనర్(ఈస్ట్) సురేందర్ సింగ్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement