Friday, April 26, 2024

హార్వెస్టర్ కింద పడి ఒకరి మృతి

జనగామ : జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామానికి చెందిన మిద్దెపాక యాదగిరి (49) గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద వరి కోయడానికి వరి కోత మిషన్ మాట్లాడుకొని తన పొలం వద్దకు తీసుకువెళ్లడానికి బైక్ మీద ముందు వెళ్తుండగా అదే హార్వెస్టర్ వాహనం కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. కాగా మృతిచెందిన యాదగిరి కోమల్ల ప్రాథమిక హెల్త్ సెంటర్ లో పని చేస్తున్నారు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement